సాక్షి, ఒంగోలు: రెండెకరాల చంద్రబాబు.. రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారని వైఎస్సార్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఆయన గురువారం మీడిమాతో మాట్లాడుతూ.. దేశంతో అత్యంత ధనిక సీఎం చంద్రబాబే అని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ పోరాడుతుంటే .. కేసుల భయంతో చంద్రబాబు కేంద్రానికి సాగిలపడ్డారని విమర్శించారు. ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ మోహన్ రెడ్డి ప్రకటిస్తే.. కేంద్రంతో గొడవలొద్దని టీడీపీ ఎంపీలకు బాబు చెబుతున్నారని మండిపడ్డారు.