కరీనంగర్‌లో బండి సంజయ్‌ భారీ విజయం

23 May, 2019 14:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ హవా వీస్తుంటే కరీంనగర్‌లో మాత్రం కమలం వికసించింది. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, సిట్టింగ్‌ ఎంపీ బి. వినోద్‌ కుమార్‌పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ 87 వేలపైగా ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన  బండి సంజయ్ కు సానుకూల, సానుభూతి పవనాలు వీచాయి. గత ఎంపీ ఎన్నికల్లోనూ ఆయన పోటీచేసి ఓడిపోయారు. ఈసారి కరీంనగర్ ఓటర్ మార్పు చూపించాడు. బండి సంజయ్ కు భారీ ఆధిక్యం కట్టబెట్టి… సంచలన తీర్పు ఇచ్చారు.

మరిన్ని వార్తలు