వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకే: భట్టి

1 Jul, 2019 13:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియ జెప్పాడానికే తాము సచివాలయ సందర్శన చేశామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సచివాలయం భవనాల పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్ సచివాలయ భవనాలను కూలుస్తా అంటున్నారు. ఈ రాష్ట్రం అనేక అవసరాల కోసం తెచ్చుకున్నాం. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఉద్యోగం, వ్యవసాయం ఇలా అనేక అవసరాలు తీరాక కొత్త సచివాలయం కడితే బాగుండేది. 

ఈ అసెంబ్లీకి, సచివాలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సరిపోయే అన్ని సదుపాయాలు,హంగులు ఉన్నాయి. వసతులు లేవు అని ఈ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. సచివాలయంలో అన్ని బ్లాకులు 10 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల క్రితం కట్టినవే.అందరి అవసరాలు తీర్చే అతిపెద్ద భవనం ఈ సచివాలయం. సచివాలయంలో ఉన్న అన్ని బ్లాక్‌లు చాలా బాగున్నాయి. సీఎం కేసీఆర్ మనసులో ఇక దుర్మార్గ ఆలోచన తట్టింది. అన్ని భవనాలపైన తన పేరు ఉండేలా కేసీఆర్ ఇలాంటి తప్పుడు నిధుల దుర్వినియగా నిర్ణయాల తీసుకుంటున్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన తేవొద్దని కోరుతున్నాం.’ అని అన్నారు.

చదవండితెలంగాణ సచివాలయంలో కాంగ్రెస్ నేతలు

మరిన్ని వార్తలు