ఈ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి: జాజుల

26 Dec, 2017 01:30 IST|Sakshi

హైదరాబాద్‌: రాబో యే పార్లమెంట్‌ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. 30న సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగే బీసీ విద్యార్థి మహా గర్జనకు మద్దతు తెలపాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను కోరారు. 

ఈ సందర్భం గా బీసీ బిల్లును ఆమోదింపజేసి బీసీల పక్షాన నిలబడతామని దత్తాత్రేయ అన్నారు. అనంతరం బీసీ విద్యార్థి గర్జన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు