ఎన్నికల ఖర్చు కోసం భిక్షాటన

20 Mar, 2019 11:49 IST|Sakshi

నల్లకుంట: ఎన్నికలు ఖరీదైపోయాయని, ఖర్చుల కోసం ఓ అభ్యర్థి భిక్షాటన చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంబర్‌పేటకు చెందిన కె.వెంకటనారాయణ సామాజిక కార్యకర్త. ఈయన సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ఖర్చుల కోసం రుణం ఇవ్వాలని బ్యాంకుల చుట్టూ తిరగ్గా, అధికారులు ససేమిరా అన్నారు. చివరకు ఫ్యాక్స్‌ ద్వారా రాష్ట్రపతికి వినతి పత్రం పంపించాడు. అయినా ఫలితం లేకపోవడంతో ‘ఓటు + నోటు.. ఓటు అమ్ముకోకండి’ అనే నినాదంతో మంగళవారం భిక్షాటనకు శ్రీకారం చుట్టాడు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ... ఎన్నికల వ్యయం కోసం రుణం మంజూరు చేయాలని పలు బ్యాంకుల్లో దరఖాస్తులు అందజేశానని, అయితే ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల కోసం రుణం ఇవ్వలేమని అధికారులు చెప్పారన్నారు. దీంతో భిక్షాటన చేస్తున్నానన్నారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీల్లో భిక్షాటన చేస్తానన్నారు.

మరిన్ని వార్తలు