సాక్షి, విశాఖపట్నం : భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీ కాకర లక్ష్మీ ఎంపీ అవంతి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతోపాటు భీమిలి జోన్ తెలుగు యువత అధికార ప్రతినిధి దంతులూరి సిద్ధార్థవర్మ, తాళ్లవలస పంచాయతీకి చెందిన ఎల్లారావు, పంచాయతీ వార్డు మెంబర్లు గొలగాని సూరిబాబు, రామసూరిని అవంతి శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యలమంచిలి సూర్య నారాయణ, వేణురాజు, సన్నిబాబు, అమక్కమాని అప్పలనాయుడు, రమణ తదితరులు పాల్గొన్నారు. (మోదీ, ట్రంప్ను కూడా భీమిలి నుంచి పోటీ చేయమంటారేమో!)