‘అందుకే పాదయాత్రలో అండగా నిలుస్తున్నారు’

25 Sep, 2018 11:28 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి

పాదయాత్రలో జననేతకు సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు

సాక్షి, విజయనగరం: ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్బంగా సంఘీబావంగా నిన్న(సోమవారం) జననేతతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. మంగళవారం పాదయాత్ర ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయడు అవినీతిని, అక్రమాలను 3000 కిలోమీటర్ల పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ వివరించారన్నారు. టీడీపీ ప్రభుత్వ దోపిడీ ఏ విధంగా ఉందో పాదయాత్రలో ప్రజలు జననేతకు చెప్పారన్నారు. తమ పార్టీ అధినేత చెప్పే ప్రతీ మాట నిజమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. టీడీపీ కంచుకోటగా చెప్పుకునే ఉత్తరాంధ్రలో ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ఆదరణే అందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలంతా ఆవేదన చెందుతున్నారని.. అందుకే పాదయాత్రలో వైఎస్‌ జగన్‌కు అండగా నిలుస్తున్నారన్నారు.  

జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు సంఘీభావం తెలిపారు. పలు చోట్లు కేకులు కట్‌ చేయగా, కొన్ని చోట్ల అభిమానులు రక్తదాన శిభిరాలు నిర్వహించారు. మరికొన్ని ప్రాంతాల్లో  వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇక వైఎస్‌ జగన్‌ పాదయాత్ర విజయనగరం జిల్లా ఎస్‌. కోట నియోజకవర్గంలో దిగ్విజయంగా సాగుతోంది. 
 

>
మరిన్ని వార్తలు