నచ్చజెప్పిన నటుడు
కృష్ణరాజపురం: లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేయబోతున్న బహుభాషా నటుడు ప్రకాశ్రాజ్ చాపకింద నీరులా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయన సోమవారం మహదేవపుర నియోజకవర్గంలోని కాడుగోడి వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు ప్రధాని నరేంద్రమోదీకి జై అంటు నినాదాలు చేయగా, ప్రకాశ్రాజ్ వారిని శాంతపరిచి, ఇది తనపై వ్యక్తమైన వ్యతిరేకత కాదని, ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతన్నారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు శాశ్వతంగా ఇళ్లు నిర్మించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రజలు రాజకీయ నేతలపై అసహనంతో ఉన్నారని ఈ క్రమంలో ప్రచారానికి వచ్చిన తమపై అసహనాన్ని వ్యక్తం చేశారన్నారు. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై త్వరలో ముఖ్యమంత్రితో చర్చిస్తానని తెలిపారు.