పలు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం

15 Feb, 2020 12:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అన్ని రాష్ట్రాలలో  పార్డీ బలోపేతానికి కృషి చేస్తున్న బీజేపీ శనివారం పలు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించింది. కేరళ బీజేపీ అధ్యక్షుడిగా సురేంద్రన్‌ను, సిక్కిం బీజేపీ అధ్యక్షుడిగా దాల్ బహదూర్ చౌహాన్, మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా విష్ణు దత్ శర్మలను బీజేపీ అధిష్టానం నియమించింది. త్వరలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో నూతన బీజేపీ అధ్యక్షులను అదిష్టానం నియమిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

చదవండి: అలాంటి మాటలు వాడకుంటే బావుండేది: షా

మరిన్ని వార్తలు