మున్సిపల్‌ ఎన్నికలపై సమావేశమైన బీజేపీ

14 Jul, 2019 13:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో కొంత పట్టు సాధించిన బీజేపీ, త్వరలో జరగనున్న మున్సిపాల్‌ ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ఈ దిశగా ఆదివారం హైదరాబాద్‌లో కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో  పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సూచించిన అంశాలపై చర్చ కొనసాగింది. దీనితోపాటు బీజేపీ సభ్యత్వ నమోదు, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ వంటి అంశాలను  చర్చించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, రాజా సింగ్‌, డీకే అరుణ హాజరైయ్యారు

మరిన్ని వార్తలు