కోల్కతా : గతంలో కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ పార్టీలు పూర్తిగా చతికిలపడ్డాయి. సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్కు బీజేపీ అనూహ్యంగా గట్టిపోటీ ఇవ్వగా, వామపక్షాలు కనీసం ఖాతా తెరిచే పరిస్థితి లేకపోవడం గమనార్హం. బెంగాల్లో మొత్తం 42 స్ధానాల్లో తృణమూల్ కాంగ్రెస్ 23 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 18 స్ధానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే కాషాయదళం బెంగాల్లో ప్రబల శక్తిగా ఎదిగే దిశగా ఫలితాలు సాధిస్తోంది. ఇక పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాతే సార్వత్రిక ఫలితాలపై వ్యాఖ్యానిస్తానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. విజేతలకు ఆమె అభినందనలు తెలిపారు.