బీజేపీ కీలక భేటీ ప్రారంభం

18 Feb, 2018 11:43 IST|Sakshi

సాక్షి, విజయవాడ : విభజన హామీలపై ప్రజల ఆందోళన, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయవాడ హోటల్‌ ఐలాపురంలో బీజేపీ విస్తృతస్తాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీజేపీ ఏపీ సీనియర్‌ నేతలు, అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చడం లేదని, రాష్ట్రానికి తగిన నిధులు ఇవ్వడం లేదని భాగస్వామ్య పక్షం టీడీపీ చేస్తున్న ఆరోపణలను దీటుగా ఎదుర్కోవడం, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో టీడీపీ నేతలు బీజేపీ లక్ష్యం చేస్తున్న విమర్శలకు దీటుగా కౌంటర్‌ ఇవ్వాలని కమల దళం నేతలు భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు