సాక్షి, హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సెప్టెంబర్ 15న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పర్యటనలో భాగంగా శక్తి కేంద్ర ప్రముఖులతో అమిత్ షా సమావేశం అవుతారు. అనంతరం ఆఫీస్ బేరర్స్, జిల్లా ఇంఛార్జ్లు, అధ్యక్షులతో ఆయన భేటీ కానున్నారు. 15వ తేదీ మధ్యాహ్నం మహాబూబ్నగర్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఈనెల 29న కరీంనగర్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు.