‘సీఎం అబద్ధాలు చెప్పారు’

29 Oct, 2019 03:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ సభలో సీఎం కేసీఆర్‌ అబద్ధాలు, అవాస్తవాలు తప్ప ఇంకొకటి మాట్లాడలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వృద్ధాప్యంతోనో, అహంకారంతోనో కేసీఆర్‌ లాజిక్‌ లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. కార్పొరేషన్‌గా ఉన్న ఆల్విన్‌ ఉద్యోగులను గతంలో ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోలేదా? అని ప్రశ్నిం చారు. ఆర్టీసీ విషయంలో ఇదెందుకు సాధ్యం కాదని నిలదీశారు.

మరిన్ని వార్తలు