కేసీఆర్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారు..

14 Sep, 2019 20:46 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు 

సాక్షి, కరీంనగర్‌ జిల్లా: బీజేపీ తలుపులు తెరిస్తే టీఆర్‌ఎస్‌లో ఒక్క ఎంపీ కూడా మిగలరని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చి కుటుంబ పాలన సాగిస్తుందని విమర్శించారు. కాళ్వేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పై కోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం, మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు సేవ సప్తాహ కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భం గా ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయల్లో  జాతీయ జెండాలు ఎగుర వేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు