ఇమ్రాన్‌ది రోడ్డుపక్క ప్రసంగం

28 Sep, 2019 22:20 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా  బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దీనిపై స్పందించారు. ఇమ్రాన్‌ ప్రసంగాన్ని 'రోడ్డుపక్క ప్రసంగం'తో పోల్చారు. శనివారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోడ్డు పైనున్న జనాలను ఉద్దేశించి మాట్లాడినట్టు ఇమ్రాన్ ప్రసంగం సాగిందని, పాక్ ఆర్మీ ఒత్తిడికి తలొగ్గి అలా ప్రసంగించారని విమర్శించారు. ఇమ్రాన్ ప్రసంగం పాక్‌లో చదువురాని కొందరికి సంతోషం కలిగించొచ్చని, ధైర్యంగా ప్రసంగించారని వారి మెప్పు పొందొచ్చని అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఒత్తిడికి లొంగే ఆయన ప్రసంగం సాగినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు