సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం పార్లమెంటులోని లైబ్రరీ భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ వారం ఉభయసభల్లో పలు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. అనంతరం ఓటింగ్తో బిల్లులను ఆమోదించుకోవాల్సిన అవసరం ఉండటంతో పార్టీ ఎంపీలందరూ విధిగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని ఈ భేటీలో ప్రధాని మోదీ కోరారు.