రాజస్ధాన్‌ కాషాయమయం..

23 May, 2019 13:32 IST|Sakshi

జైపూర్‌ : ఉత్తరాదిన కమలం ప్రభంజనంతో రాజస్ధాన్‌లోనూ బీజేపీ క్లీన్‌స్వీప్‌ దిశగా సాగుతోంది. మొత్తం 25 లోక్‌సభ స్ధానాలకు గాను 23 స్ధానాల్లో బీజేపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. కాంగ్రెస్‌ ఒకే ఒక స్ధానంలో ఆధిక్యంలో ఉండగా, ఇతరులు మరో స్ధానంలో ఆధిక్యంలో ఉన్నారు. రాజస్ధాన్‌లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందినా సార్వత్రిక సమరంలో బీజేపీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకుంది.

ఇక హిందీ రాష్ట్రాల్లో బలీయ శక్తిగా బీజేపీ మరోమారు తన సత్తా చాటింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే సాధారణ మెజారిటీ సాధించే దిశగా సాగుతోంది. కాషాయ ప్రభంజనంతో పలు రాష్ట్రాల్లో విపక్షాలు గల్లంతయ్యాయి.

మరిన్ని వార్తలు