రాహుల్ లగ్జరీ జాకెట్‌పై విసుర్లు

31 Jan, 2018 13:09 IST|Sakshi
షిల్లాంగ్‌లో జరిగిన కార్యక్రమానికి ఖరీదైన జాకెట్‌ ధరించి హాజరైన రాహుల్‌ గాంధీ

షిల్లాంగ్‌: మేఘాలయ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై బీజేపీ దాడి మొదలుపెట్టింది. ‘సూటు బాటు సర్కారు’ అంటూ గతంలో మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన రాహుల్‌పై ఎదురుదాడికి దిగింది.

మంగళవారం షిల్లాంగ్‌లో జరిగిన సంగీత కార్యక్రమానికి ఖరీదైన జాకెట్‌ ధరించి ఆయన హాజరయ్యారు. దీన్ని తమకు అవకాశంగా మలుచుకుని బీజేపీ మేఘాలయ విభాగం ట్విటర్‌లో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. దాదాపు 70 వేల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ జాకెట్‌ ధరించారని ట్విటర్‌లో ఫొటోలు పోస్ట్‌ చేసింది. మేఘాలయ ప్రజల గురించి పట్టించుకోకుండా, రాష్ట్రంలో ఉన్న అసమర్థ సర్కారుకు వంతపాడతారా అని ప్రశ్నించింది. రాహుల్‌ చూపిస్తున్న పక్షపాతం మేఘాలయ ప్రజలను వెక్కిరిస్తున్నట్టుగా ఉందని బీజేపీ విమర్శించింది.

2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో భేటీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ. 11 లక్షల ఖరీదైన సూట్‌ ధరించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీతో సహా ప్రతిపక్షాలు మోదీపై విమర్శలకు దిగాయి. తర్వాత ఆ సూట్‌ను వేలంలో రూ. 4.31 కోట్లకు విక్రయించారు.

కాగా, 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీకి నాగాలాండ్‌తో పాటు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న ఫలితాలు వెలువడతాయి.

So @OfficeOfRG , soot(pun intended!)-boot ki sarkar with ‘black’ money fleeced from Meghalayan State exchequer by rampant corruption? Instead of singing away our woes, you could have given a report card of your inefficient govt in Meghalaya! Your indifference mocks us! pic.twitter.com/sRvj5eoyRb

మరిన్ని వార్తలు