రైల్వేజోన్, ప్రత్యేక హోదా కోసం రక్తదానం

24 Mar, 2018 20:52 IST|Sakshi
కొణతాల రామకృష్ణ

సాక్షి, విశాఖపట్నం :​ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రైల్వేజోన్,  ప్రత్యేక హోదా సాధనకోసం రక్తదాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ తెలిపారు.  విభజన హామీలతో సహా ఉత్తరాంధ్రకు ఆర్ధిక ప్యాకేజీ హామీ అమలు కోసం ఈ నెల 30న ఉదయం 9 గంటలకు విశాఖపట్నం రైల్వే హాస్పిటల్ లో రక్త దానం కార్యక్రమం చేబడుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుదామని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు