‘చంద్రబాబు ముఖంలో క్రూరత్వం కనిపిస్తోంది’

26 Oct, 2018 14:06 IST|Sakshi

హైదరాబాద్‌: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే  రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు స‍్పందించిన తీరు మాత్రం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు దాడి ఘటనను ఖండించకుండా, డ్రామా అని వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గు చేటన్నారు. ఏదైనా ఘటన జరిగితే మానవత్వం ఉన్నవారు స్పందిస్తారు.. అలాంటిది రాష్ట్ర సీఎంగా ఉన్న చంద‍్రబాబు మాత్రం అదొక డ్రామా అంటూ మాట్లాడటం ఆయనలో క్రూరత్వాన్ని తెలియజేస్తోందన్నారు.

చంద్రబాబు ఒక రాజకీయ ఉన్నాదిలా మాట్లాడుతున్నారని, ఆయన ముఖంలో క్రూరత్వం కనిపిస్తోందని బొత్స విమర్శించారు. వైఎస్‌ జగన్‌ను రాజకీయ పార్టీలు పరామర్శించడం తప్పు అనే విధంగా బాబు మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. చంద్రబాబుది నోరా.. తాటిమట్టా అంటూ ధ్వజమెత్తారు. ఆయన చిన్నమెదడు చితికినట్లు ఉందంటూ బొత్స ఎద్దేవా చేశారు. ఎవరైనా గాయమైతే ఆస్పత్రికి వెళ్తారా.. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తారా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. పట్టుబడిన నిందితుడి వద్ద 11 పేజీల లేఖ ఎలా వచ్చిందో చెప్పాలంటూ బొత్స డిమాండ్‌ చేశారు. చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారడానికి ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలే ఉదాహరణగా బొత్స తెలిపారు. ఏపీలో ఒక ఎమ్మెల్యే హత్యకు గురైనప్పుడే మీ పాలన ఎలా ఉందో అందరికీ తెలిసిందన్నారు. ఏపీలో శాంతి భద్రతలు అనేవి అసలు లేవని ఈ సందర్భంగా బొత్స పేర్కొన్నారు.

ఇక్కడ చదవండి

‘ఆపరేషన్‌ గరుడ వెనుక ఉన్నది చంద్రబాబే’

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై పవన్‌ కల్యాణ్ సీరియస్‌

పక్కదారి పట్టించేందుకు బాబు పక్కా స్కెచ్‌

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం

మరిన్ని వార్తలు