అసెంబ్లీలో ప్రశ్నించిన బుగ్గన రాజేంద్రనాథ్
అప్పట్లో సాక్షికిచ్చిన నోటీసుల వివరాలు వెల్లడించిన మంత్రి
సాక్షి, అమరావతి: తప్పుడు వార్తలపై చర్య తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన జీవోపై విపక్షం రాద్ధాంతం సరికాదని శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. గురువారం ఆయన సభలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో ‘సాక్షి’ పత్రికపై కత్తిగట్టి కేసులు పెట్టారని తెలిపారు. ఆ కేసుల వివరాలను ఆయన సభలో చదివి వినిపించారు.
ఆ కేసుల వివరాలివీ..
ఇప్పుడెందుకు గొడవ?
అప్పట్లో ఇన్ని జీవోలిచ్చి సాక్షిపై కక్ష సాధింపునకు పాల్పడిన టీడీపీ నేతలు ఇప్పుడు అవాస్తవ వార్తలపై చర్యలు తీసుకుంటామంటే రాద్ధాంతం చేస్తున్నారని బుగ్గన విమర్శించారు. సింగపూర్ కంపెనీలు ఇక్కడ పెట్టిన బిలియన్ డాలర్లు వృథా అయ్యాయని కొన్ని పేపర్లు వార్త రాశాయన్నారు. మనం చెడిపోయేదే కాక పక్క దేశాలను కూడా చెడగొడుతున్నారని తప్పుపట్టారు. ముఖ్యమైన బిల్లులను అడ్డుకోవడమే ప్రతిపక్షం లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు.