కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

21 Jul, 2018 13:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాయలసీమ సీనియర్‌ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, రఘువీరారెడ్డి రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. ఇటీవల మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు