సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ నేతృత్వంలోని బృందం సోమవారం మధ్యాహ్నం రాష్ట్రానికి చేరుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఈసీ బృందం రాష్ట్రంలోని గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీల నాయకులతో హోటల్ తాజ్ క్రిష్ణలో భేటీ అయ్యింది.
ఈసీతో సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు నేతలు హాజరుకానున్నట్లు సమాచారం. అంతేకాక ఈసీ ఒక్కో పార్టీ నాయకులతో దాదాపు 10 నిమిషాల పాటు సమావేశం కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈసీతో భేటీ నిమిత్తం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు హోటల్ తాజ్ క్రిష్ణకు చేరుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు వీరితో ముఖాముఖి నిర్వహించి అభిప్రాయాలు సేకరించనున్నారు.
ఈసీ బృందంతో భేటికి హాజరైన పార్టీలు - సభ్యులు
బీఎస్పీ - సిద్ధార్థ్ పూలే
బీజేపీ - ఇంద్రసేనా రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం
సీపీఐ - చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు
సీపీఎం - నంద్యాల నర్సింహా రెడ్డి, వెంకటేష్
ఎంఐఎం - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ జాఫ్రీ
టీఆర్ఎస్ - వినోద్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి
కాంగ్రెస్ - మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్
టీడీపీ - రావుల చంద్రశేఖర్ రెడ్డి, గురుమూర్తి
వైసీపీ - రవికుమార్, సంజీవరావు
పార్టీలతో సమావేశం ముగిసిన అనంతరం ఈసీ బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, పోలీసు విభాగం నోడల్ అధికారి, అదనపు డీజీ జితేందర్రెడ్డిలతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది.
రేపటి షెడ్యూల్
బుధవారం షెడ్యూల్