విభజన హామీలపై నిర్లక్ష్యమెందుకు: చాడ

17 Jul, 2018 01:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తయినా విభజన చట్టంలోని హామీలను సాధించుకోవడంలో సీఎం కేసీఆర్‌ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగుల విభజన పూర్తికాలేదని, షెడ్యూల్‌–9లోని సంస్థ ల విభజన జరగలేదని, ప్రాణహితకు బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా రాలేదని, హైకోర్టు విభజన కాలేదని, పరిశ్రమలు, వర్సిటీల హామీలను సాధించుకోలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు