సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజరిక, ఫాసిస్టు పాలన అంతానికి ముం దస్తు ఎన్నికలతో చరమగీతం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించిన కేసీఆర్, ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నా చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి, నిజాంను కీర్తిస్తూ, నిజాం తరహాలోనే కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. సెప్టెంబర్ 17న అన్ని బస్తీల్లో, గ్రామాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామని తెలిపారు.