ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది: చాడ

21 Oct, 2017 05:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘అక్టోబర్‌ 2009లో నీటి ఉధృతికి అలంపూర్‌లోని పాకలివీధిలో దాదాపు 800 ఇళ్లు కూలిపోయి కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ విషయంలో అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది, 2015లో ముఖ్యమంత్రి హోదాలో మీరు అలంపూర్‌కు వచ్చినప్పుడు అక్కడి నిర్వాసితులు మీకు విజ్ఞాపన పత్రం ఇచ్చి మూడేళ్లు దాటినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది’’అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం కేసీఆర్‌కు 10వ బహిరంగ లేఖ రాశారు.

మరిన్ని వార్తలు