‘ప్యాకేజీ చంద్రబాబు అంగీకరించలేదా’

3 Aug, 2018 21:16 IST|Sakshi
పురంధేశ్వరి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, కృష్ణా : రాష్ట్ర వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై చంద్రబాబు నాయుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి విమర్శించారు. శుక్రవారం ఆమె ఓ సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే  టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. హోదా కంటే ప్యాకేజీ గొప్పగా ఉంటుందని చంద్రబాబు అంగీకరించలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రా విభజనకు చంద్రబాబు వ్యతిరేకం కాదన్నారని గుర్తుచేశారు. రాష్ట్రా ప్రయోజనాల నాలుగేళ్ల పాలనలో కోసం ఏమైనా అడిగారా అని ధ్వజమెత్తారు.

>
మరిన్ని వార్తలు