అశోక్‌బాబుకు చంద్రబాబు ఆహ్వానం

3 Jul, 2018 17:02 IST|Sakshi
అశోక్‌ బాబు, చంద్రబాబు (పాత ఫొటో)

సాక్షి, ఏలూరు : ఆంధ్రప్రదేశ్‌ ఎన్జీవో నాయకుడు అశోక్‌బాబును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరులో ఏపీ ఎన్జీవో హో భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న అశోక్‌బాబు టీడీపీలో చేరి క్రీయాశీలకంగా వ్యవహరించాలని కోరారు.

ఏపీ విభజన సందర్భంగా ఎన్జీవోలు తీవ్ర పోరాటాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అశోక్‌ బాబు ఎప్పుడు పార్టీలో చేరినా సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు