‘చంద్రబాబు అందుకే యూటర్న్’

21 Jun, 2018 20:41 IST|Sakshi
పార్థసారధి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, అమరావతి: తమకు పదవుల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వైఎస్సార్‌సీపీ నేత పార్థసారధి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమమవుతుందని, హోదా కోసం తమ పార్టీ మొదటి నుంచి పోరాడుతోందని అన్నారు.  హోదాని చంద్రబాబు నాయుడు అవహేళన చేశారని ప్రత్యేక హోదా రాకపోవడానికి ఏపీ సీఎం ముఖ్యకారణమంటూ విమర్శించారు. హోదాపై వైఎస్సార్‌సీపీ పోరాటాన్ని చూసి చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని, మొదటి నుంచి ప్రత్యేక హోదాకు బాబు వ్యతిరేకమని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని పార్థసారధి పేర్కొన్నారు. ఏప్రిల్‌ 6న వైఎస్సార్‌సీపీ నేతలు తమ ఎంపీ పదవులకు చేసిన రాజీనామాలు నేడు ఆమోదం పొందిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు