పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన చిదంబరం

5 Dec, 2019 10:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కుంభకోణం, మనీ ల్యాండరింగ్‌ కేసుల్లో బెయిల్‌పై విడుదలైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం గురువారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే  ఈ కేసుకు సంబంధించి చిదంబరం మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. కాగా ఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ ఈ ఏడాది ఆగస్టు 21న చిదంబరాన్నికస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.

చదవండి: చిదంబరానికి బెయిల్‌

మరిన్ని వార్తలు