వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే

18 Mar, 2019 13:08 IST|Sakshi

సాక్షి, చిత్తూరు  :వైఎస్సార్‌సీపీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. తొలి, మలి విడతల్లో ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్యే అభ్యర్థులను ఆదివారం వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయలో ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వడంతో  అభ్యర్థులు ప్రచార పర్వంలో మునిగిపోయారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల పర్వం సాగనుంది. 

అసెంబ్లీ
నగరి  
పేరు     : ఆర్‌కే రోజా (శ్రీలత)
భర్త      : ఆర్‌కే సెల్వమణి,
పిల్లలు    : ఇద్దరు
స్వగ్రామం    : నగరి
పుట్టిన తేదీ     : 17.11.1972
విద్యార్హత     : బీఎస్సీ (హోం సైన్స్‌),పద్మావతి డిగ్రీ కళాశాల, తిరుపతి
పదవులు     : వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ శాసనసభ కమిటీ సభ్యురాలు.

గంగాధరనెల్లూరు 
పేరు    : కళత్తూరు నారాయణస్వామి
పుట్టిన తేదీ    : 01–06–1949
జన్మస్థలం    : పాదిరికుప్పం
భార్య    :  పరంజ్యోతి
చదువు    : బీఎస్సీ, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి

మదనపల్లె 
అభ్యర్థి పేరు    : మహమ్మద్‌ నవాజ్‌ బాషా
స్వగ్రామం    : మదనపల్లె
పుట్టిన తేదీ    : 02–10–1973
భార్య    : ఎం.ఫర్మీనా యాస్మీన్‌
చదువు    : పదో తరగతి
వృత్తి     : పారిశ్రామిక వేత్త
రాజకీయ నేపథ్యం  : మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి తదితర నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి.

 చిత్తూరు  
పేరు     : ఆరణి శ్రీనివాసులు (జంగాపల్లె శ్రీనివాసులు)
పుట్టిన తేదీ : 15.05.1952
చదువు     : బీఏ
స్వస్థలం     : జంగాలపల్లి
సామాజికవర్గం : బలిజ (కాపు)
సతీమణి      : ఆరణి సత్యవతి
పిల్లలు     : ఇద్దరు
రాజకీయ నేపథ్యం: ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.

శ్రీకాళహస్తి  
పేరు    : బియ్యపు మధుసూదన్‌రెడ్డి
జననం    : 15.05.1971
పుట్టిన గ్రామం    : అమ్మపాళెం, శ్రీకాళహస్తి మండలం
భార్య    : బియ్యపు శ్రీవాణిరెడ్డి
పిల్లలు    : ఇద్దరు
విద్యార్హత    : బీఏ
రాజకీయ అనుభవం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. జగన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ను స్థాపించి సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు.

పుంగనూరు
పేరు    : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుట్టిన తేదీ    : 01–07–1952
భార్య    : స్వర్ణలత
పిల్లలు    : ఇద్దరు
విద్యార్హత    : ఎంఏపీహెచ్‌డీ(సోషియాలజీ)
రాజకీయ నేపథ్యం:  2008లో పీసీసీ ఉపాధ్యక్షుడుగా, 2009లో పుంగనూరు ఎమ్మెల్యేగా, వైఎస్సార్, రోశయ్య ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు

తిరుపతి
అభ్యర్థి: భూమన కరుణాకరరెడ్డి
చదువు: బీఏ
పుట్టిన తేదీ: 05–04–1958
పుట్టిన ఊరు: రేణిగుంట
వృత్తి: రాజకీయం
భార్య పేరు:  రేవతి
పిల్లలు: ఇద్దరు
రాజకీయానుభవం: తుడా చైర్మన్, టీటీడీ చైర్మన్‌గా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. 2012లో తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

చంద్రగిరి   
పేరు: డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
పుట్టిన తేదీ     : 04–06–1973
చదువు: ఎంఏ, బీఎల్, పీహెచ్‌డీ
భార్య: లక్ష్మి
పిల్లలు: ఇద్దరు
స్వగ్రామం: తుమ్మలగుంట, తిరుపతి రూరల్, చిత్తూరు జిల్లా
పదవులు: తుడా చైర్మన్‌ (2007–2010)
టీటీడీ బోర్డు సభ్యుడు (2007–2010)
చంద్రగిరి శాసనసభ్యుడు ( 2014–2019)

సత్యవేడు  
పేరు    : కోనేటి ఆదిమూలం
స్వగ్రామం    : నారాయణవనం మండలం భీముని చెరువు గ్రామం
పుట్టిన తేదీ     : 03–04–1952
భార్య    : కె.గోవిందమ్మ
పిల్లలు    : నలుగురు
విద్యార్హత    : బీఏ
రాజకీయ అనుభవం:  వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీల హక్కుల కోసం పోరాడుతున్నారు.

పలమనేరు  
పేరు    : నల్లప్పగారి వెంకటేగౌడ
భార్య    : పావని
పిల్లలు    : ఇద్దరు
స్వగ్రామం    : తోటకనుమ,

వీకోట మండలం
విద్యార్హత    : బీఏ
యాక్టివిటీస్‌    : ఐదేళ్లుగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వృత్తి    : వ్యాపార వేత్త

తంబళ్లపల్లె  
పేరు: పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
పుట్టిన తేదీ: 1–6–1967
జన్మస్థలం: సదుం
భార్య: పెద్దిరెడ్డి కవిత
పిల్లలు: ఒక కుమారుడు
రాజకీయ అనుభవం: సదుం సింగిల్‌విండో చైర్మన్, జిల్లా సహకార మార్కెటింగ్‌ సోసైటీ చైర్మన్‌గా పనిచేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు.

పీలేరు
అభ్యర్థిపేరు: చింతల రామచంద్రారెడ్డి
పుట్టిన తేదీ: 13.09.1962
విద్యార్హత: బీఏ
భార్య: నీరజమ్మ,
కొడుకు: సాయికృష్ణారెడ్డి చింతల
జన్మస్థలం: వాయల్పాడు
రాజకీయ అనుభవం: మూడు పర్యాయాలు ఎమ్మెల్యే(1987,1994,2014)

కుప్పం  
పేరు :  చంద్రమౌళి
భార్య:  పద్మజ
పిల్లలు: ఇద్దరు
స్వగ్రామం:  చిత్తూరు
పుట్టిన తేదీ     : 01–07–1953
విద్యార్హత : ఎం.ఏ, ఎస్వీయూనివర్సిటీ
వృత్తి :  రిటైర్డు ఐఏఎస్‌ ఆఫీసర్‌
రాజకీయానుభవం: 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుపై పోటీ చేశారు. దాదాపు 10 వేల ఓట్ల వరకు చీల్చగలిగారు.
ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ సమన్వయకర్తగా         పనిచేస్తున్నారు.

పూతలపట్టు  
నియోజకవర్గం :పూతలపట్టు
పేరు: ఎంఎస్‌.బాబు
పుట్టిన తేదీ     : 04–03–1971
భార్య పేరు: ఎం.బీల
పిల్లలు : ఇద్దరు
స్వగ్రామం: 5 వెంకటాపురం, పిళ్లారిమిట్ట
చదువు: ఇంటర్మీడియెట్‌
వృతి : వ్యాపారం
రాజకీయ అనుభవం  :
ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు 

మరిన్ని వార్తలు