రేపు లోక్‌సభ ముందుకు ప్రతిష్టాత్మక బిల్లు

8 Dec, 2019 17:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నపౌరసత్వ సవరణ బిల్లు రేపు పార్లమెంట్ ముందుకు రానుంది. లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్‌లో పౌరసత్వ సవరణ బిల్లును లిస్ట్ చేసింది మోదీసర్కార్‌. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు వలసొచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు వీలుగా ఈ సవరణ బిల్లు తెచ్చింది కేంద్రం. 1955 పౌరసత్వ బిల్లుకు సవరణలు చేసింది. ముస్లిం దేశాల నుంచి మతఘర్షణల కారణంగా వలసొచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ఈ బిల్లు ద్వారా లబ్ధి చేకూరనుంది. అయితే మతప్రాతిపదిక పౌరసత్వాన్ని కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఎం వ్యతిరేకిస్తున్నాయి.

మరిన్ని వార్తలు