ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం పర్యటన

26 Aug, 2018 12:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న ప్రధానిని కలిసిన కేసీఆర్‌ రాష్ట్రానికి పలు అంశాలపై చర్చించారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30గంటలకు హోంమత్రి రాజ్‌నాథ్‌, సాయంత్రం 4.30గంటలకు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీతో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశంలో వెనుకబడిన జిల్లాలకు నిధుల విడుదల, ఎఫ్‌ఆర్‌భీఎమ్‌ రుణపరిమితి పెంపు తదితర అంశాలపై చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు