అవిశ్వాస తీర్మానం.. మేం మద్దతివ్వం..

19 Jul, 2018 12:54 IST|Sakshi
సీఎం ఎడపాడి పళనిస్వామి

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్‌డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానుంది. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడం లేదని తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ఈ తీర్మానానికి టీఆర్‌ఎస్‌ మద్దతివ్వదని ఆ పార్టీ ఎంపీ కవిత ముందుగానే సంకేతమిచ్చిన విషయం తెలిసిందే.​ కావేరి జలాలపై మా పార్టీ చేసిన పోరాటానికి ఏ పార్టీ మద్దతివ్వలేదని సీఎం ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. అందుకే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం లేదని సీఎం పళని స్వామి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు