వైఎస్సార్‌సీపీలో చేరిన కాంగ్రెస్‌ నేత

12 Jan, 2019 18:46 IST|Sakshi

సాక్షి, పులివెందుల: కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది అబ్దుల్‌ గఫూర్‌ శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో గఫూర్‌, ఆయన అనుచరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి.. పార్టీలోకి వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ కనిగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి బుర్ర మధుసూదన్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో అబ్దుల్‌ గఫూర్‌తోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు దాదాపు 500మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు