'ఇవాంకకు లేఖ రాశా'

1 Dec, 2017 14:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పారశ్రామిక వేత్తల సదస్సు కేటీఆర్‌ షో గా నడిచిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు విమర్శించారు. కీలకమైన సదస్సులో నేతలను భాగస్వామ్యం చేయకుండా అవమానించరన్నారు. కనీసం నగర మేయర్‌నుకూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సదస్సుకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అమెరికా అద్యక్ష సలహాదారు ఇవాంక కు హైదరాబాద్‌లో అన్నీ అవాస్తవాలే చెప్పారన్నారు.  వాస్తవాలు తెలుసుకోవాలని ఆమెకు లేఖ రాసినట్టు వీహెచ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు