‘కేసీఆర్ వాగ్ధాన వీరుడు - అబద్ధాల ధీరుడు’

20 Oct, 2018 16:44 IST|Sakshi
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి

సాక్షి, కామారెడ్డి : తెలంగాణ ముఖ్యమంత్రి కే చం‍ద్రశేఖర్‌ రావు ‘‘వాగ్ధాన వీరుడు- అబద్ధాల ధీరుడు’’, కాంట్రాక్టర్‌ల ప్రియుడని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి విమర్శించారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు లక్ష బిక్షం వేస్తావా? ఎలా ఇస్తావంటూ మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణను దోచుకుని దాచుకుంటాడని విమర్శించారు.

తన రాజకీయ జీవితంలో చూసిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్‌ను దరిద్రమైన ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు.  బహుభాశా కోవిదుడు పీవీ నరసింహారావ్ పుట్టిన తెలంగాణ గడ్డపై మురికి భాషను ప్రవేశ పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భాషను యాసను కేసీఆర్‌ మలినం చేశారని అన్నారు. కేసీఆర్! నరేంద్ర మోదీతో రహస్య ఒప్పందం మేరకే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు