అసెంబ్లీ టికెట్‌ కోసం రూ.38లక్షలు వసూలు

16 Jul, 2020 11:26 IST|Sakshi

కాంగ్రెస్‌ ‘గ్రేటర్‌’ నేతపై పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు

వరంగల్‌: గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఇప్పిస్తానని కాంగ్రెస్‌ గ్రేటర్‌ వరంగల్‌ ముఖ్యనేత డబ్బు తీసుకున్నాడని మహిళా నేత ఒకరు ఆరోపించారు. ఈ విషయమై బుధవారం పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్‌ స్థానానికి టికెట్‌ ఇప్పిస్తానని సదరు నాయకుడు తన వద్ద రూ.38 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే, అసెంబ్లీ టికెట్‌ చేజారగా, జెడ్పీటీసీగా పోటీ చేసిన సమయంలో కూడా ఎన్నికల ఖర్చు కోసం ఎన్నిసార్లు అడిగినా డబ్బు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరకు రూ.26లక్షలు ఇచ్చినా, మిగిలిన డబ్బు కోసం ఇచ్చిన చెక్‌లు బౌన్స్‌ అయ్యాయని తెలిపారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేయగా, వారం రోజుల్లో న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు