నెలరోజులే మీ ఆటలు

13 Apr, 2018 09:11 IST|Sakshi

సిద్ధు, రాహుల్‌గాంధీకి బీజేపీ అధినేత హెచ్చరిక

ధార్వాడలో అమిత్‌షా నిరాహారదీక్ష

సాక్షి, బళ్లారి: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఇక నెల రోజులే సిద్ధరామయ్య, రాహుల్‌గాంధీ ఆటలు  సాగుతాయి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టంచేశారు. పార్లమెంటులో కాంగ్రెస్‌ తీరును నిరసిస్తూ గురువారం ధార్వాడలో కలెక్టర్‌ కార్యాలయం వద్ద బీజేపీ నిర్వహించిన నిరాహారదీక్ష సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాహుల్‌గాంధీ ఎంతగా ప్రచారం చేసినా విజయం బీజేపీదేనని జోస్యం చెప్పారు.

మఠాల్లో అమిత్‌షా ప్రత్యేక పూజలు
రెండురోజుల ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్‌షా బుధవారం రాత్రి హుబ్లీలో బస చేశారు. గురువారం ఉదయం హుబ్లీలోని ప్రసిద్ధ సిద్ధారూఢ మఠాన్ని దర్శించుకున్నారు. స్వామీజీలు పూర్ణకుంభాలతో స్వాగతం పలికారు.  అక్కడ నుంచి షా నేరుగా ధారవాడలో వరకవి దక్షిణ రాజేంద్ర స్మారక భవనానికి చేరుకున్నారు. గ్రం«థాలయంతో పాటు వస్తు సంగ్రహాలయం పరిశీలించిన అనంతరం వరకవి బేంద్రె ఫోటోకు పూజలు నిర్వహించారు. ధార్వాడలోని మురుఘ మఠాన్ని ఆయన దర్శించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆయనతో పాటు బీజేపీ సీనియర్లు యడ్యూరప్ప, జగదీశ్‌ శెట్టర్, ఎంపీ ప్రహ్లాదజోషి తదితరులు పాల్గొన్నారు. అమిత్‌షా శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

మరిన్ని వార్తలు