ఓటు బ్యాంక్‌ కోసమే విద్వేషాలు

27 Feb, 2020 02:11 IST|Sakshi

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

హఫీజ్‌పేట్‌: ఓటు బ్యాంక్‌ కోసమే ప్రజల మధ్య విద్వేషాలను సృష్టిస్తున్నారని.. ఢిల్లీలో జరిగే అల్లర్లకు బీజేపీనే కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. బుధవారం కొండాపూర్‌లో  ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏలను కేరళ, తెలంగాణ, బిహార్, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలు వ్యతిరేకించాయన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఉద్యమించి సభలు, సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. మార్చి 23న భారీ బహిరంగ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన వల్ల దేశానికి ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లుతుందని నారాయణ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు