‘చంద్రబాబు వేయి పడగల విష సర్పం’

30 Jan, 2020 17:03 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు వేయి పడగలు ఉన్న మహా విష సర్పమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ, ఉత్తరాంధ్రలపై చంద్రబాబు విషం కక్కుతు​న్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసుతో ఉత్తరాంధ్ర ప్రజలపై కక్ష సాధిస్తున్నారని వీరభద్రరావు అన్నారు.అలాంటి చంద్రబాబుకు 23 సీట్లు ఇచ్చి ప్రజలు ప్రతిపక్షనాయకుడిగా చేసి తప్పు చేశారన్నారు.

గతంలో ఎన్టీఆర్ బోఫోర్స్ కుంభకోణానికి  వ్యతిరేకంగా ఎంపీలును రాజీనామా చేయించి మెప్పు పొందారని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అమరావతి అవసరం అనుకుంటే తమ పార్టీ ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇంకా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సీఎం అని..  దేశంలో పీఎం అని భ్రమపడుతున్నారని వీరభద్రరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు విశాఖపట్నంపై విషప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తుఫానులు, వరదలు వస్తాయని ప్రజలను భయపెడుతున్నారని దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు