‘పవార్‌ సాబ్‌తోనే ఉంటా’

25 Nov, 2019 08:13 IST|Sakshi

ముంబై : అజిత్‌ పవార్‌తో కలిసి దేవేంద్ర ఫడ్నవీస్‌ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తూ తాను ఎన్సీపీని మోసం చేయలేదని ఆ పార్టీ నేత ధనంజయ్‌ ముండే అన్నారు. ‘ నేను పార్టీ వెంట, పవార్‌ సాబ్‌ వెంటే ఉన్నా..దయచేసి వదంతులు ప్రచారం చేయకండ’ని ఆయన ట్వీట్‌ చేశారు. బీజేపీకి మద్దతిస్తూ అజిత్‌ పవార్‌ చేసిన ప్రకటన కేవలం పార్టీలో గందరగోళం సృష్టించి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపేందుకేనని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించినయ కొద్ది గంటలకే ధనంజయ్‌ ముండే ఈ ట్వీట్‌ చేశారు.

దేవేంద్ర ఫడ్నవీస్‌ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు చొరవ చూపడంలో అజిత్‌ పవార్‌తో కీలక సమన్వయం నెరిపారని భావిస్తున్న ముండే పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితిని సమీక్షించేందుకు శరద్‌ పవార్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు అసెంబ్లీ తనకు తగిన సంఖ్యాబలం ఉందని దేవేంద్ర ఫడ్నవీస్‌ గవర్నర్‌కు రాసిన లేఖతో పాటు ఫడ్నవీస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్‌ రాసిన లేఖలను తమకు సమర్పించాలని గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ సుప్రీం కోర్టు కోరింది.

>
మరిన్ని వార్తలు