16 మందిని గెలిపిస్తే ఏం ఒరగబెడతావ్‌ : డీకే అరుణ

30 Mar, 2019 20:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ హిందువులను అవమానించే రీతిలో మాట్లాడుతున్నారంటూ బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌ నోరు హద్దులో పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. 13 స్థానాలు గెలిచినప్పుడు ఏం చేశావ్‌.. ఇప్పుడు 16 మందిని గెలిపించుకుని ఏం ఒరగబెడతావ్‌ అని ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికలు సీఎంని డిసైడ్‌ చేస్తే.. ఈ ఎన్నికలు పీఎంను డిసైడ్‌ చేస్తాయని తెలిపారు.

మహబూబ్‌ నగర్‌లో తాను అందరికి సుపరిచితురాలినేనని.. ఓడినా.. గెలిచినా పాలమూరు అభివృద్ధి కోసం పోరాడానని గుర్తు చేశారు. మీ ఆడబిడ్డకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం.. మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని తెలిపారు.

మరిన్ని వార్తలు