'మద్యం మత్తులోనే అత్యాచారాలు, హత్యలు'

10 Dec, 2019 02:37 IST|Sakshi

సాక్షి, ఖానాపూర్‌ : రాష్ట్రాన్ని తాగు బోతుల తెలంగాణగా మార్చడంతో పాటు మహిళలపై అత్యాచారాలు, హత్యలకు కేరాఫ్‌గా రాష్ట్రాన్ని నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ ఎద్దేవా చేశారు. సోమవారం ఆసిఫాబాద్‌ జిల్లా ఎల్లాపటార్‌ ఘటన బాధిత కుటుంబాన్ని, అలాగే.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని దీన్‌దయాళ్‌ నగర్‌ కాలనీలో తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  

పరామర్శించిన తమ్మినేని 
మానస కుటుంబాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానస ఘటనలో పోలీసులు ముగ్గురిని కీలక నిందితులుగా గుర్తించి ఒక్కరినే అరెస్టు చేసి కీలక నిందితుడిగా పేర్కొనడం సరైంది కాదన్నారు. 
 

మరిన్ని వార్తలు