బీజేపీ ఎమ్మెల్యేపై రూ. 204 కోట్ల దావా 

5 Aug, 2019 06:59 IST|Sakshi

బెంగళూరు: తనపై నిరాధార వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ సీనియర్‌నేత డీకే శివకుమార్, బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌పై రూ. 204 కోట్ల పరువునష్టం దావా వేశారు. శివకుమార్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జూన్‌ 23న పాటిల్‌ నాపై నిరాధార వ్యాఖ్యలు చేశారు. కేసులు నమోదు చేయవద్దంటూ నేను బీజేపీ నాయకులను, కేంద్ర మంత్రులపై ఒత్తిడి తెచ్చినట్లు మీడియాతో అన్నారు. ఒకవేళ నాపై కేసులు నమోదుచేయకపోతే సంకీర్ణ కూటమి పతనంలో నేను తటస్థ వైఖరి అనుసరిస్తాను అన్నట్లు చెప్పారు. వీటి వల్ల కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టిలో నా విధేయత, చిత్తశుద్ధి దెబ్బతిన్నాయి. నా ప్రతిష్ట మంటగలిచింది’ అని చెప్పారు. రామానగర్‌ జ్యుడీషి యల్‌ మెజిస్ట్రేట్‌  కోర్టులో సెప్టెంబర్‌ 18న ఈ కేసు విచారణకు రానుంది. 

మరిన్ని వార్తలు