ఎగ్జిట్‌ ఫలితాలు చూసి ఆందోళన వద్దు

23 May, 2019 05:26 IST|Sakshi

పార్టీ కార్యకర్తలకు రాహుల్‌ గాంధీ భరోసా

న్యూఢిల్లీ: ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు చూసి ఆందోళన చెందవద్దని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ‘రాబోయే 24 గంటలు మనకు చాలా కీలకం. అప్రమత్తంగా ఉండండి. ధైర్యాన్ని కోల్పోకండి. మనం సత్యం కోసం పోరాడుతున్నాం. తప్పుడు ఎగ్జిట్‌ ఫలితాలను చూసి నిరాశచెందకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ కష్టం ఎప్పటికీ వృథా కాదు’ అని బుధవారం ట్వీట్‌ చేశారు. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు, వదంతులను చూసి నిరాశచెందవద్దని ఇటీవల ప్రియాంక గాంధీ కూడా పార్టీ కార్యకర్తలకు సూచించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు