రాహుల్‌ గాంధీకి ఈసీ నోటీసులు

2 May, 2019 04:21 IST|Sakshi

న్యూఢిల్లీ: గిరిజనులను కాల్చి చంపడం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించిందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఈసీ బుధవారం ఈ నోటీసులు ఇస్తూ, 48 గంటల్లోగా రాహుల్‌ స్పదించాలనీ, లేని పక్షంలో రాహుల్‌ను సంప్రదించకుండానే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటా మంది. ప్రత్యేక వార్తాహరుడి ద్వారా రాహుల్‌కు ఈ నోటీసులను ఈసీ పంపింది. 

మరిన్ని వార్తలు