సాక్షి, తాడికొండ : ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ నాయకులు పలు ఎత్తుగడలు వేస్తారు. ప్రచారం ఊపందుకొన్న నాటి నుంచి ఓటింగ్ జరిగేంత వరకు డబ్బు, మద్యం ఎరజూపి ఓటర్లను మభ్య పెడుతుంటారు. అంతటితో ఆగకుండా ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ఎంతటి చర్యలకైనా వెనుకాడకుండా వారిని తమ వైపు తిప్పుకునే యత్నం చేస్తారు.
ఇలాంటి వారి ఆగడాలను అరికట్టి వాళ్లు చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) సీ–విజిల్ పేరిట ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా జరుగుతున్న అక్రమాలను సెల్ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోల రూపంలో చిత్రీకరించి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే ఎన్నికల కమిషన్ అధికారులు చర్యలకు ఉపక్రమిస్తుంది.
అక్రమాలకు పాల్పడిన వారు తప్పించుకొనే వీలుండదు
సీ–విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే అక్రమాలకు పాల్పడిన వారు తప్పించు కోవటానికి వీలుండదు. ఈ యాప్ జీపీఎస్తో అనుసంధానమై ఉంటుంది. ఫిర్యాదు ఏ ప్రాంతం నుంచి వచ్చిందో కూడా ఇట్టే తెలిసి పోతుంది. ఫిర్యాదు చేసిన వారి వివరాలను ఎన్నికల కమిషన్ గోప్యంగా ఉంచుతుంది. గత ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో ఈ యాప్ను ఉపయోగించి అధికారులు సత్ఫలితాలు సాధించారు. తెలంగాణ ఎన్నికల్లో దీనిని అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టారు.
ఫిర్యాదు చేయడం ఇలా..