ఏపీ ఓటర్ల తుది జాబితా ప్రకటించిన ఈసీ

12 Jan, 2019 16:47 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్‌ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు. తూర్పుగోదావరిలో అత్యధికంగా 40,13,770 మంది ఓటర్లు ఉండగా, అత్యల్ప ఓటర్లు(17,33,667) ఉన్న జిల్లాగా విజయనగరం నిలిచింది.

జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య

జిల్లా పేరు ఓటర్ల సంఖ్య
శ్రీకాకుళం 20,64,330
విజయనగరం 17,33,667
విశాఖ పట్నం 32,80,028
తూర్పు గోదావరి  40,13,770
పశ్చిమ గోదావరి 30,57,922
కృష్ణా 33,03,592
గుంటూరు 37,46,072
ప్రకాశం 24,95,383
నెల్లూరు 22,06,652
కడప 20,56,660
కర్నూలు 28,90,884
అనంతపురం 30,58,909
చిత్తూరు 30,25,222
>
మరిన్ని వార్తలు